Home » Yadagirigutta
బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రసాదం టికెట్లు డిజిటల్ సేవల ద్వారా అందుతున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించే పనుల్లో కదలిక వచ్చింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే భక్తులకు ‘స్నాన సంకల్పం’ ఆర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన ఉన్న గుండంలో భక్తులు స్నానమాచరించేవారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది.
ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు.
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.