NRI: రియాధ్‌లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ABN , First Publish Date - 2022-12-25T20:17:56+05:30 IST

తెలుగు దేశం పార్టీ వినూత్నంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం క్రమేణా గల్ఫ్ దేశాలలో కూడా విస్తరిస్తోంది.

NRI: రియాధ్‌లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు దేశం పార్టీ(TDP) వినూత్నంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం క్రమేణా గల్ఫ్ దేశాలలో కూడా విస్తరిస్తోంది. పార్టీ అభిమానులు తమకు తోచిన విధంగా స్థానిక నిబంధనలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్(Riyadh) నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో ప్రవాసీయులు నివసిస్తున్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా ఎన్నారై శాఖ(TDP NRI) ఇటీవల ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించగా సాయంత్రం వేళ చలిని సైతం లెక్క చేయకుండా పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వడ్లమూడి సారథి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరయ్య, రమేశ్, చలపతి రావు, సుదర్శన్, దేవరాజు, ప్రసాద్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T20:22:13+05:30 IST