Ramappa Temple: కేంద్ర బలగాల ఆధీనంలోకి రామప్ప ఆలయం

ABN , First Publish Date - 2022-12-26T12:33:07+05:30 IST

జిల్లాలోని రామప్ప ఆలయంలో కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది.

Ramappa Temple: కేంద్ర బలగాల ఆధీనంలోకి రామప్ప ఆలయం

ములుగు: జిల్లాలోని రామప్ప ఆలయం (Ramappa Temple)లో కేంద్ర బలగాల (Central forces) ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈనెల 28న వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్పను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (President Draupadi Murmu) సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రామప్ప ఆలయాన్ని కేంద్ర బలగాలు కంట్రోల్లోకి తీసుకున్నాయి. రక్షణ రంగానికి చెందిన హెలికాఫ్టర్లతో ట్రైల్ రన్ నిర్వహించారు. 27, 28 తేదీల్లో రామప్పకు సందర్శకులను నిలిపివేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రాకతో ములుగు జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - 2022-12-26T12:54:28+05:30 IST