నారా లోకేశను కలిసిన బీకే
ABN , First Publish Date - 2023-11-29T00:14:32+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పునః ప్రారంభించిన యువగళం పా దయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పా ల్గొన్నారు. నారాలోకేశను కలిసి సంఘీభావం తెలిపారు.
పెనుకొండ, నవంబరు 28 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పునః ప్రారంభించిన యువగళం పా దయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పా ల్గొన్నారు. నారాలోకేశను కలిసి సంఘీభావం తెలిపారు. కోనసీ మ జిల్లా అమరాపురంలో లోకేశ నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయనను కలిసి నడిచినట్లు బీకే పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ లోకేశబాబు ప్రజలతో కలుస్తూ వారి సమస్యలు తెలుసు కుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. పాదయాత్రకు సంఘీభావంగా గ్రామాల కు గ్రామాల ప్రజలు కదిలి వస్తుండటంతో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుందన్నారు. దారిపొడవునా ఆయనకు మహిళలు ఎదురెళ్లి హారతులు ఇచ్చి వీరతిలతకం దిద్ది స్వాగతం పలుకుతున్నారన్నారు. సైకో పాలన పట్ల ప్రజలు చైతన్యం చేసేందుకు లోకేష్ వేసిన తొలి అడుగు యువగళం జనగళం అయిందన్నారు.