ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: జేసీ
ABN , First Publish Date - 2023-11-29T00:24:11+05:30 IST
ప్రజా సమస్యల ను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.
![ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: జేసీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యాడికి, నవంబరు 28: ప్రజా సమస్యల ను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, చింతలాయపల్లి, యాడికిలో మంగళవారం ఆయన పర్యటించారు. యాడికిలో టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. మండలంలోని అన్నిగ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో తాను సమావేశమవుతా నని తెలిపారు. టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలందరికి వివరించాలని ఆయన తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకుడు చవ్వా గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, రవికుమార్రెడ్డి, లక్ష్మణ్, శేఖర్, శ్రీహరి, రామకృష్ణ, హరినాథ్రెడ్డి, నాగలింగారెడ్డి, బయపురెడ్డి, రాఘవ, నీలకంఠ, కంబగిరిస్వామి, శరభారెడ్డి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.