Share News

టీడీపీతోనే నాయీబ్రాహ్మణులకు న్యాయం

ABN , First Publish Date - 2023-11-29T00:05:59+05:30 IST

టీడీపీతోనే నాయీబ్రాహ్మణులకు తగిన న్యాయం జరుగుతుందని టీడీపీ నాయీబ్రాహ్మణ సెల్‌ నాయకులు పేర్కొన్నారు.

టీడీపీతోనే నాయీబ్రాహ్మణులకు న్యాయం
బీసీ బాటకు హాజరైన టీడీపీ నాయీబ్రాహ్మణ సెల్‌ నాయకులు

అనంతపురం అర్బన, నవంబరు 28: టీడీపీతోనే నాయీబ్రాహ్మణులకు తగిన న్యాయం జరుగుతుందని టీడీపీ నాయీబ్రాహ్మణ సెల్‌ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం అర్బన పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్‌, కమలానగర్‌, పాతూరు తదితర ప్రాంతాల్లో బీసీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ పాలనలో నాయీబ్రాహ్మణులకు చేసిందేమి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించి, చంద్రబాబును సీఎంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయీబ్రాహ్మణ విభాగం నాయకులు ఆనంద్‌, హరిక్రిష్ణ, కడియాల కొండన్న, రాజు, మల్లికార్జున, రామకృష్ణ, లక్ష్మినారాయణ, వెంకటప్ప, నరసింహులు, సురేంద్ర, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:06:00+05:30 IST