Share News

సమసమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే

ABN , First Publish Date - 2023-11-29T00:16:33+05:30 IST

కదిరి, నవంబరు 28: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, సమసమాజ స్థాపనకోసం పోరాట చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కొనియాడారు.

 సమసమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే

కదిరి, నవంబరు 28: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, సమసమాజ స్థాపనకోసం పోరాట చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కొనియాడారు. పూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని పూలే స ర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కందికుంట పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతిని విశేష కృషి చేశారని తెలిపారు. విద్యావ్యాప్తికోసం ఆయనతో పాటు ఆయన భార్య సావిత్రీబాయి పూలే కూడా ఎనలేని కృషి చేశారని చెప్పారు. పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బంగారు కృష్ణమూర్తి, నాగప్ప, కుటాగుళ్ల శంకర్‌, గంగరాజు, రాజశేఖర్‌, డైమండ్‌ ఇర్షాన, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:16:35+05:30 IST