Share News

చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి: కాలవ

ABN , First Publish Date - 2023-11-29T00:22:51+05:30 IST

వైసీపీ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిందని, తిరిగి రాషా్ట్రన్ని ప్రగతిపథంలో నడిపించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి: కాలవ

డీ.హీరేహాళ్‌, నవంబరు 28: వైసీపీ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిందని, తిరిగి రాషా్ట్రన్ని ప్రగతిపథంలో నడిపించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మల్లికేతి, నాగలాపురం గ్రామాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవారం కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రజలకు వివరించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపితే సైకో జగనన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ హనుమంతరెడ్డి, మాజీ ఎంపీపీ మోహనరెడ్డి, పుష్పవతి నాగళ్లి, నారాయణ స్వామి, ఎంపీటీసీలు గంగాధర, మొండి మల్లికార్జున, సంగప్ప, మల్లిగౌడ, గోవింద, వెంకటేశు, గవిసిద్ధ, మర్రిస్వామి, తిప్పేస్వామి, శీన, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:22:53+05:30 IST