Share News

విద్యార్థులతో వైసీపీ ర్యాలీ

ABN , First Publish Date - 2023-11-29T00:24:42+05:30 IST

వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

విద్యార్థులతో వైసీపీ ర్యాలీ
సప్తగిరి సర్కిల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

డీజేలతో చిందులు

గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం

ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌ 28: వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో మంగళవారం ‘మళ్లీ జగనన్నే సీఎం కావాలి’ అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. టవర్‌క్లాక్‌ నుంచి చేపట్టిన ఈ ర్యాలీలో కాలేజీ విద్యార్థులను భాగస్వాముల్ని చేశారు. డీజేలు, చిందులతో ప్రధాన సర్కిళ్లల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దారినపోతున్న వారందరికి ఆ డీజే సౌండ్‌, అల్లర్లు, చిందులు విసుగుపుట్టించాయనే చెప్పాలి. గంటకుపైగా సాగిన ఈ ర్యాలీ కారణంగా టవర్‌క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకూ ట్రాఫిక్‌ మొత్తం జామ్‌ అయింది. దీంతో పోలీసులు వారిని ఏమీ అనలేక, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2023-11-29T00:24:45+05:30 IST