Share News

Ashok Gajapathi Raju : చంద్రబాబు బరువు పెరిగారంటూ వైసీపీ నేతల వెటకారం..

ABN , First Publish Date - 2023-10-14T12:58:01+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రికి వెళ్లనీయకపోవటం బుద్ధీ, జ్ఞానం లేని చర్య అని అన్నారు.

Ashok Gajapathi Raju : చంద్రబాబు బరువు పెరిగారంటూ వైసీపీ నేతల వెటకారం..

విజయనగరం : టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రికి వెళ్లనీయకపోవటం బుద్ధీ, జ్ఞానం లేని చర్య అని అన్నారు. బరువు పెరిగారంటూ వ్యగ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన వయస్సును బట్టి ఆరోగ్య సమస్యలు రావడం సహజమని.. అదే తమకు ఆందోళనగా ఉందని అశోక్ గజపతిరాజు అన్నారు. జగన్ 16 నెలలు పాటు జైల్లో ఉన్న విషయం మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. పదేళ్లుగా బెయిల్ పై ఉన్న నాయకుడు జగన్ తప్ప దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? అని అడిగారు. చంద్రబాబును జైల్లో పెట్టి, ఆయన చేసిన నేరం ఏమిటో ఇప్పటికీ నిరూపించలేకపోయారని అశోక్ గజపతిరాజు అన్నారు.

Updated Date - 2023-10-14T12:58:01+05:30 IST