Home » AP News
Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్-1లో ఉన్న బడి దేవరమ్మ కొండపై గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతం పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్కు చెందిందని, గతంలో అటవీశాఖ అధికారులు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించారు.
జిల్లాలోని గిరి శిఖర గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సమాచార వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీతంపేట ఏజెన్సీలో 40కి పైగా బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఇకనుంచి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు గెడ్డలు, వాగుల నుంచి నాటుబండ్లతో పాటు ట్రాక్టర్లతో కూడా ఇసుకను తరలించవచ్చు.
తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులంతా అప్రమత్తం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. బుధవారం తన క్యాంప్ కార్యాల యం నుంచి జిల్లా, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Andhrapradesh: కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. పట్టించుకోని జగన్ శాంతిభద్రతలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
Andhrapradesh: గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. జగన్ జులం ప్రదర్శించాలని చూస్తూ కుదరదు అంటూ ఆలపాటి రాజా వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
తూర్పుమధ్య బంగాళాఖాతంలో దానా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావం ఏపీపై తక్కువే అయినప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభావం కానున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
Andhrapradesh: ఏపీలో లా అండ్ ఆర్డర్పై వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే తమ హయాంలో మహిళ కోసం తీసుకువచ్చిన పథకాలపై మాట్లాడారు. ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఎత్తేసిందని మండిపడ్డారు.
దానా తుపాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్ అండ్ డౌన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.