TDP: ఎమ్మెల్యే కేతిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని ఐటీడీపీ కార్యకర్తపై దాడి

ABN , First Publish Date - 2023-04-16T19:40:34+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం తుమ్మలలో ఆర్మీ జవాను సమరసింహారెడ్డిపై

TDP: ఎమ్మెల్యే కేతిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని ఐటీడీపీ కార్యకర్తపై దాడి

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం తుమ్మలలో ఆర్మీ జవాను సమరసింహారెడ్డిపై దాడిని మరువకనే ఆదివారం ఐటీడీపీ (ITDP) కార్యకర్త పూల నరేశ్‌పై ధర్మవరంలో విచక్షణారహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (MLA Kethi Reddy Venkatarami Reddy)కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడన్న కారణంతో దాడి చేశారు. ఇటీవల స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఆసరా మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘మీ కోసం నేను, నా తమ్ముడు, భార్య చాకిరీ చేస్తుంటే.. మీరేమో.. భోజనం కోసం వెంపర్లాడుతున్నారు’ అని‌ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాటిని తప్పుబడుతూ నరేశ్‌ (Naresh) సోషియల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్టును చూసిన వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టు పెడతావా అంటూ నరేశ్‌ను విచక్షణారహితం కొట్టారు.తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. బాధితుడు నరేశ్‌ ఫిర్యాదు మేరకు ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.

Updated Date - 2023-04-16T19:40:34+05:30 IST