టీడీపీ నరసరావుపేట ఇన్‌చార్జి సహా 30 మందిపై కేసు

ABN , First Publish Date - 2023-02-24T21:25:02+05:30 IST

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు (Chadalavada Aravinda Babu), ఆయన వ్యక్తి గత కార్యదర్శి షేక్‌ బాజీతో పాటు..

టీడీపీ నరసరావుపేట ఇన్‌చార్జి సహా 30 మందిపై కేసు

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు (Chadalavada Aravinda Babu), ఆయన వ్యక్తి గత కార్యదర్శి షేక్‌ బాజీతో పాటు డాక్టర్‌ కడియాల వెంకటేశ్వరరావు, కడియాల రమేష్‌, పులిమి రామిరెడ్డి, కుమ్మెత కోటిరెడ్డి, గూడూరి శేఖర్‌లతో కలిపి మొత్తం 30 మందిపై స్థానిక రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరిపై పబ్లిక్‌ న్యూసెన్స్‌, అక్రమ సమావేశం, నిబంధనలు ఉల్లంఘన తదితర సెక్షన్లు నమోదు చేశారు. రొంపిచర్ల మండల టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డి మృతదేహాన్ని తీసుకువెళ్తూ పట్టణ శివారులో రెండురోజుల క్రితం ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని కేశానుపల్లి వీఆర్‌వో రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. దీంతో నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-24T21:25:02+05:30 IST