Share News

Chelluboina Venugopala Krishna : జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు

ABN , First Publish Date - 2023-11-20T13:32:05+05:30 IST

ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కుల గణన -2023 పై ప్రాంతీయ సదస్సుకు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులు హాజరయ్యారు.

Chelluboina Venugopala Krishna : జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు

విజయవాడ : ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కుల గణన -2023 పై ప్రాంతీయ సదస్సుకు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశమంతా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను ఫాలోఅవుతోందన్నారు.

గతంలో మంజునాధన్ కమిషన్ ఫెయిలైందన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి శాశ్వత బీసీ కమిషన్ ను వేశారన్నారు. బీహార్ లో కులగణనకు రాజకీయ కోణం ఉందని చెల్లుబోయిన అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు. సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. అన్ని సామాజిక వర్గాల పై జగన్ మోహన్ రెడ్డికి ఎంతో గౌరవం ఉందన్నారు. గతంలో ఉద్యమాలు చేసినా, కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదని చెల్లుబోయిన పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T13:32:07+05:30 IST