ఎస్ఏ-1 పరీక్షల్లో తప్పుచేస్తే చర్యలు: డీఈవో
ABN , First Publish Date - 2023-11-29T00:42:54+05:30 IST
సమ్మెటివ్ అసిస్మెంట్-1 (ఎస్ఏ-1) పరీక్ష నిర్వహణలో తప్పులు చేస్తే చర్యలు తప్పవని డీఈవో విజయేంద్రరావు హెచ్చరించారు.
![ఎస్ఏ-1 పరీక్షల్లో తప్పుచేస్తే చర్యలు: డీఈవో](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 28: సమ్మెటివ్ అసిస్మెంట్-1 (ఎస్ఏ-1) పరీక్ష నిర్వహణలో తప్పులు చేస్తే చర్యలు తప్పవని డీఈవో విజయేంద్రరావు హెచ్చరించారు. మంగళవారం ప్రారంభమైన ఈ పరీక్షలకు సంబంధించి చిత్తూరుతో పాటు పలు పాఠశాలలను ఆయన పరిశీలించారు. డిసెంబరు 8వ తేదీ వరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ సమయాల్లో నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపొద్దన్నారు. విద్యార్థులకు మార్కులు తగ్గే సబ్జెక్టుల్లో ఆయా టీచర్లపై తగు చర్యలు తప్పవన్నారు. ఎక్కడా ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూడాలన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు సైతం పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.