Home » Andhra Pradesh » Chittoor
నెల్లూరులోని కేఎన్ఆర్ పాఠశాలలో శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కిందపడడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.
తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్ ట్రస్టు తరఫున స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన
నామినేటెడ్ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకే్షకుమార్ మీనా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు.
సమతా సైనిక్ దళ్(ఎ్సఎ్సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ డీఎంహెచ్వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు.
తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్ అయ్యాడు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.