Share News

యువతకు మెరుగైన శిక్షణకే ఒప్పందాలు

ABN , First Publish Date - 2023-11-29T00:40:27+05:30 IST

నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

యువతకు మెరుగైన శిక్షణకే ఒప్పందాలు
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఐసీఓఎల్‌తో ఒప్పందం చేసుకుంటున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)తో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎ్‌సఎ్‌సడీసీ), నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు కంపెనీల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 240 కుట్టుమిషన్లు ఐవోసీఎస్‌ ద్వారా శిక్షణ పొందిన వారికి ఉచితంగా ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబుల్‌ కింద ఐఓసీఎల్‌ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కాగా, ఐఓసీఎల్‌ వారు రూ.18.65 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ యూన్‌ ఏసీ, ఈడీ ఆఫ్‌ ఏపీఎ్‌సఎ్‌సడీసీ దినే్‌షకుమార్‌, కంపెనీ ప్రతినిధులు బాలమురగన్‌, రఘువంశీ, శ్యాంమోహన్‌, గుణశేఖర్‌, విజయప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:40:28+05:30 IST