Share News

మద్యం విక్రేత అరెస్టు

ABN , First Publish Date - 2023-11-29T00:51:21+05:30 IST

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో వున్నట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ మోహన్‌ బాబు తెలిపారు.

మద్యం విక్రేత అరెస్టు
మద్యంతో పట్టుబడ్డ నిందితుడిని చూపుతున్న ఎస్‌ఈబీ పోలీసులు

మరొకరు పరారీ

బంగారుపాళ్యం, నవంబరు 28: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో వున్నట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ మోహన్‌ బాబు తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా ఇంటెలిజెన్స్‌ బృందానికి అందిన సమాచారం మేరకు ఎస్‌ఈబీ అధికారులు, ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ పృథ్వీ, సిబ్బంది బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామ సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్ద దాడులు జరిపారు. అదే గ్రామానికి చెందిన తిరుమలేశ్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 480 కర్ణాటక మద్యం టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అదే గ్రామానికి చెందిన సుకుమార్‌ పరారీలో ఉన్నాడని, అతడిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఈబీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-29T00:51:22+05:30 IST