ప్రకృతి వ్యవసాయం పరిశీలన
ABN , First Publish Date - 2023-11-29T00:41:37+05:30 IST
పెనుమూరు మండలం చార్వాగానిపల్లిలో మెనుమ్మకు చెందిన ప్రకృతి వ్యవసాయ పంటను మంగళవారం అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది.
![ప్రకృతి వ్యవసాయం పరిశీలన](https://media.andhrajyothy.com/media/2023/20231102/28ctr_pnr1_FF_de73b1df1f.jpg)
పెనుమూరు, నవంబరు 28: పెనుమూరు మండలం చార్వాగానిపల్లిలో మెనుమ్మకు చెందిన ప్రకృతి వ్యవసాయ పంటను మంగళవారం అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను, జ్ఞాపకాలను తమ దేశాలకు తీసుకెళతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు విందాయ్ దిమోనియో, మారియా క్లాడియా క్రిప్టాన్, షాలిని రామిరేజ్, మాన్యువల్ నర్జస్, మారియా కరోలియా, వాటిజ్ రోజాస్, అలెజాండ్రా, వరగాస్ మాడ్రిడ్, కెవిన్ ఒన్యాంగో, సుదర్శన్ మలైయప్పన్, గోపాల్కుమార్, సిల్వియా వ్యానిరా, తొరై జిగ్వేనా, మార్సెలాబెల్ర్టాన్తో పాటు ఏపీ రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు, రాము, జిల్లా ప్రాజెక్టు మేనేజరు జి.వాసు తదితరులు పాల్గొన్నారు.