బైక్ల దొంగ అరెస్టు
ABN , First Publish Date - 2023-11-29T00:15:17+05:30 IST
మోటార్సైకిళ్లు, సెల్ఫోన్లను దొంగిలిస్తున్న కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన యెశెట్టి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు బిక్కవోలు ఎస్ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.
![బైక్ల దొంగ అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బిక్కవోలు, నవంబరు 28: మోటార్సైకిళ్లు, సెల్ఫోన్లను దొంగిలిస్తున్న కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన యెశెట్టి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు బిక్కవోలు ఎస్ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బిక్కవోలు-ఆర్ఎస్ పేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకటరమణ తమను చూసి బైక్పై పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది సాయంతో అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బండికి సంబంధించి ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో అతనిని విచారించగా తాను ఇప్పటి వరకూ 9 బైక్లు, 9 సెల్ఫోన్లను దొంగిలించానని తెలిపాడన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని బిక్కవోలు పోలీస్స్టేషన్లో రెండు, పెద్దాపురం పోలీస్స్టేషన్లో నాలుగు, పెదపూడిలో ఒకటి, పాయకరావుపేటలో ఒకటి, సర్పవరంలో ఒకటి, కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. వాటి విలువ రూ.8 లక్షలు ఉంటుందన్నారు. అలాగే ఏడు సెల్ఫోన్లను కాకినాడ పరిసర ప్రాంతాల్లోను, ఒకటి పెద్దాపురం, ఒకటి ఉండూరులో దొంగిలించినట్లు వెంకటరమణ తెలిపాడన్నారు. ఈ సెల్ఫోన్లకు సంబంధించి ఆధారాలు, కొన్న బిల్లులు తీసుకువస్తే అధికారుల ఉత్తర్వుల మేరకు వారికి అందజేస్తామన్నారు. ఈ నేరాలలో అతనితో పాటు మరో ఇద్దరు బాలురు పాల్గొన్నట్లు గుర్తించామని వారిపై బాలల సంరక్షణ, రక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బుజ్జిబాబు వివరించారు.