Home » Andhra Pradesh » East Godavari
టీడీపీలో ఉంటూ పార్టీకే నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా పార్టీ ఉపేక్షించదని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్తిపాడు మండలం టీడీపీ నాయకులు ఆదివారం తేటగుంట తరలివెళ్లి మాజీ మంత్రి, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును కలిశారు.
16వ నెంజరు జాతీయ రహదారి ఆనుకుని తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద ఆదివారం వివస్త్రగా ఉన్న ఓ మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
భువనమోహన రూపుడైన సత్యదేవుడి కల్యాణం ఆదివారం రాత్రి రత్నగిరిపై అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంత రహితుడైన స్వామి, అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడిన వేళ ప్రకృతి పరవశించగా రత్నగిరి పులకరించింది.
గోదావరి నదిపై ఉన్న వంతెనలకు 500 మీటర్ల లోపు ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత హెచ్చరించారు. ఆదివారం కొవ్వూరు మండలం కుమారదేవం, చిడిపి, తాళ్లపూడి మండలం బల్లిపాడు, కడియం మండలం వేమగిరి గ్రామాల్లోని ఇసుక ర్యాంపులను అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. గోదావరి నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఓపెన్ రీచెస్, బోట్స్మేన్ సొసైటీలు, డ్రెజ్జింగ్ తవ్వకాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ఇసుకర్యాంపులను తనిఖీచేశారు.
ఆద్యంతం ఉద్యమాలు, పోరాటాలు, నిరాడంబరతతో ము డిపడిన సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకమని, నేటితరం సుందరయ్య స్ఫూర్తితో విలువల కోసం నిలబడాలని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, సీనియర్ నేత దువ్వా శేషబాబ్జి అన్నారు.
వైఎస్ఆర్ జగనన్న సమగ్ర భూ సర్వే కారణంగా రాజానగరం నియోజకవర్గంలోని మేజర్ గ్రామాల్లో భూమి రిజిష్ట్రేషన్లు నిలిచిపోయాయి.దీంతో ఎప్పుడు జనంతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.
ఎన్నికలు అయిపోయాయి..లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. మరో 15 రోజుల్లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది తేలిపోనుంది. అయినా ఫలితాలపై మా త్రం ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో 5 నియోజకవర్గాలది ఒక ఎత్తు.. రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం నియోజకవర్గాలది మరో ఎత్తు.. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు.
వంతెనల పక్కన ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడంలేదు.. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు.
అష్టకష్టాలు పడి అప్పులు చేసి మరీ పంటలు పండించిన అన్నదాతకు చివరికి మిగిలేది కష్టమే.. ధాన్యం అమ్మినా సొమ్ము చేతికి అందక.. చేసిన అప్పులు తీరక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక చూస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 25 నాటికి కౌంటింగ్ రూమ్ల ఏర్పాట్లు పూర్తిచేయడం జరుగుతుందని కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు.