Share News

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోళ్లు

ABN , First Publish Date - 2023-11-29T00:13:02+05:30 IST

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోళ్లు

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోళ్లు

అంబాజీపేట, నవంబరు 28: అంబాజీపేట మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన నాఫెడ్‌ కొనుగోలు కేంద్రం ద్వారా సాంకేతిక సమస్యలు అధిగమించి రైతులు ఇబ్బందులు లేకుండా కొబ్బరిని కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అంబాజీపేటలో ఏర్పాటుచేసిన నాఫెడ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు అంబాజీపేటలో 224టన్నుల కొబ్బరిని కొనుగోలు చేశామన్నారు. వీరిందరికి వారం రోజుల్లో ఆయా రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామన్నారు. నాఫెడ్‌ కేంద్రాన్ని డిసెంబరు నెలాఖరు వరకూ ప్రస్తుత మద్దతు ధరలతో కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో జనవరి నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఆయన వెంట నాఫెడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ టి.ఎన్‌.శర్మ, ఆయిల్‌ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ యు.సుధాకరరావు, కృషీవల ప్రొడ్యూసర్స్‌ కంపెనీ చైర్మన్‌ గణపతి వీరరాఘువులు, ముత్యాల జమీ ఉన్నారు.

Updated Date - 2023-11-29T00:13:03+05:30 IST