యువగళం ప్రభంజనాన్ని తట్టుకోలేక జగన్ కొత్త కుట్రలు : మాజీ మంత్రి ప్రత్తిపాటి
ABN , First Publish Date - 2023-11-29T01:21:41+05:30 IST
కాకినాడ సిటీ, నవంబరు 28: యువగళం పున:ప్రారంభ ప్రభంజనాన్ని తట్టుకోలేక జగన్ కొత్త కుట్రలకు తెరలేపారని, కేసులను బూచిగా చూపి కొందరు టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తి పాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడుసహా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసు
![యువగళం ప్రభంజనాన్ని తట్టుకోలేక జగన్ కొత్త కుట్రలు : మాజీ మంత్రి ప్రత్తిపాటి](https://media.andhrajyothy.com/media/2023/20231102/28_KKD_4_3dfbae6338.gif)
కాకినాడ సిటీ, నవంబరు 28: యువగళం పున:ప్రారంభ ప్రభంజనాన్ని తట్టుకోలేక జగన్ కొత్త కుట్రలకు తెరలేపారని, కేసులను బూచిగా చూపి కొందరు టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తి పాటి పుల్లారావు ఆరోపించారు. పల్నాడుసహా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రపై కాకినాడ రూ రల్ నియోజకవర్గ నేతలతో మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్య క్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్-2 కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు, పొలిట్బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్పలు స్వాగత ఏర్పాట్లపై సమీక్షించి యువగళం పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, బండారు సత్యానందరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాసబాబా, కటకంశెట్టి బాబి, యనమల శివరామకృష్ణన్, సానా సతీష్, వాసిరెడ్డి ఏసుదాసు, చప్పిడి వెంకటేశ్వరరావు నులుకుర్తి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రంగనాఽథ్లు పాల్గొన్నారు.