ఈవోలుగా 8 మంది నియామకం
ABN , First Publish Date - 2023-11-29T00:14:02+05:30 IST
ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 8 మందిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ఈవోలుగా నియమించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు మంగళవారం తెలిపారు.
![ఈవోలుగా 8 మంది నియామకం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 28: ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 8 మందిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ఈవోలుగా నియమించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు మంగళవారం తెలిపారు. సీహెచ్ సూర్యారావును వేమగిరి గ్రూప్ దేవస్థానానికి... ఎం.సూర్యారమణిని ఐ.పోలవరం గ్రూప్ దేవస్థానానికి, కె.తిరుమల రవితేజను కరప గ్రూప్ దేవస్థానానికి, బి.నరేంద్రకుమార్ను ఆత్రేయపురం గ్రూప్ దేవస్థానానికి, బి.ధనలక్ష్మిని యు.కొత్తపల్లి గ్రూప్ దేవస్థానానికి, వి.అశ్వినిని ఏలేశ్వరం మండలం సిరిపురం శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానానికి, బి.ప్రియదుర్గను రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వరస్వామి మఠానికి, బి.కిరణ్ను గోపాలపురం గ్రూప్ దేవాలయాల ఈవోగాను నియమించినట్లు తెలిపారు. వారు త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని ఈ సందర్భంగా చెప్పారు.