Konaseema Dist.: మంత్రి వేణుకు షాక్

ABN , First Publish Date - 2023-07-16T08:04:50+05:30 IST

కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నియోజక వర్గంలో ప్రజలు మంత్రి వేణుకు షాక్ ఇచ్చారు. వెంకటాయపాలెంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Konaseema Dist.: మంత్రి వేణుకు షాక్

కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నియోజక వర్గంలో ప్రజలు మంత్రి వేణు (Minisrter Venu)కు షాక్ (Shock) ఇచ్చారు. వెంకటాయపాలెంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ (YCP) కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు వేల మందితో సమావేశం నిర్వహించడానికి ఎంపి పిల్లి సుభాష్ చంద్ర బోస్ (MP Pilli Subhash Chandra Bose) వర్గీయులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో కీలకపాత్ర వహించిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, కార్యకర్తలు సమీకరణకు పిల్లి సుభాష్ చంద్ర బోస్ వర్గీయులు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బోస్ తనయుడు సూర్య ప్రకాష్‌ను ఎన్నికల బరిలో నిలిపే దిశగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలియవచ్చింది. ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండి పెండెంట్‌గా ‌ అయినా బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా నిర్వహిం చనున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-07-16T12:43:16+05:30 IST