సూర్య ప్రతాపం!

ABN , First Publish Date - 2023-04-22T00:46:29+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి..ఉదయం 7.30 గంటలకే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఇక 9 గంటలు దాటిందంటే బయటకు రావాలంటేనే భయమేస్తుంది.

సూర్య ప్రతాపం!

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 21: ఎండలు మండిపోతున్నాయి..ఉదయం 7.30 గంటలకే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఇక 9 గంటలు దాటిందంటే బయటకు రావాలంటేనే భయమేస్తుంది. సుమారు గత 10 రోజులుగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. భానుడు ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మండిపోతున్నాడు. రోజురోజుకు ప్రతాపం చూపుతు న్నాడు.శుక్రవారం జిల్లా సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 42 .. కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీలుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే గోకవరం, దేవరపల్లిలో గరిష్టంగా 40.4 డిగ్రీలు, రాజమహేంద్రవరంలో 40.4 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. అనపర్తిలో 35.2, బిక్కవోలులో 36.7, చాగల్లులో 37.1, గోపాలపురంలో 31.7, కడియంలో 33.1 , కోరుకొండలో 38.7, కొవ్వూరులో 31.3, నల్లజర్లలో 32.9, నిడదవోలులో 35.1, పెరవలిలో 31.6 , రాజమహేంద్రవరం రూరల్‌లో 37.5 ,రాజానగరంలో 31.6, రంగంపేటలో 31.5, సీతానగరంలో 31.3 , తాళ్ళపూడిలో 38.7, ఉండ్రాజవరంలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మరొక రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-04-22T00:46:29+05:30 IST