రేపు జిల్లాలో కేవీపీఎస్‌ నిరసనలు

ABN , First Publish Date - 2023-05-23T01:00:38+05:30 IST

కొవ్వూరులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఈ నెల 24న నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు జువ్వల రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రేపు జిల్లాలో కేవీపీఎస్‌ నిరసనలు

కొవ్వూరు, మే 22: కొవ్వూరులో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఈ నెల 24న నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు జువ్వల రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అక్రమ కేసులు బనాయించడం పెరిగిపోయాయని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్యచేసి డోర్‌ డెలివరీ చేస్తే, ప్రభుత్వం అనంతబాబుకు కొమ్ముకాయడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించిన వారిపై కేసులు ఎత్తివేయడం, సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు, అంబేడ్కర్‌ విదేశీ విద్య పేరు మార్చడం అంబేడ్కర్‌ను అవమానించడమే అన్నారు. 28 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేయడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 24న జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు రాంబాబు తెలిపారు.

Updated Date - 2023-05-23T01:00:38+05:30 IST