ద్వారపూడి - యానాం రోడ్డు పనులు ఎప్పటికి పూర్తిచేస్తారు!
ABN , First Publish Date - 2023-11-29T00:13:58+05:30 IST
ద్వారపూడి - యానాం రోడ్డు పనులు ఎప్పటికి పూర్తిచేస్తారు!
![ద్వారపూడి - యానాం రోడ్డు పనులు ఎప్పటికి పూర్తిచేస్తారు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మండపేట, నవంబరు 28: ద్వారపూడి నుంచి యానాం వెళ్లే రోడ్డు పనులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25కోట్లతో చేపట్టిన పనులు ఎప్పుటికి పూర్తి చేస్తారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులను ప్రశ్నించారు. ద్వారపూడి, తాపేశ్వరం మధ్య సెంట్రల్ రోడ్డు ఫండ్ నిధులు రూ.12.5కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు ఏడాది దాటినా పూర్తి చేయకుండా కాలయాపన చేయటంపై వేగుళ్ల ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో వేగుళ్ల, స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి నల్లరిబ్బనులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఇప్పనపాడులో అసంపూర్తిగా మిగిలి పోయిన రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.