ఆళ్ళగడ్డ వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2023-08-21T13:40:06+05:30 IST

ఆళ్ళగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనూరాధ, సుధారాణి, స్వర్ణలత రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు.

ఆళ్ళగడ్డ వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు

నంద్యాల : ఆళ్ళగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో అధికార పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు రాజీనామా చేశారు. వార్డు సభ్యులు సుబ్బలక్ష్మమ్మ, అనూరాధ, సుధారాణి, స్వర్ణలత రాజీనామా పత్రాలను ఎంపీడీవో మహబూబ్ దోలాకు అందజేశారు. పంచాయితీ ఉప ఎన్నికలు జరిగిన మూడు రోజులకే వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మరో వర్గంతో కలిసి ఉండలేకనే నలుగురు రాజీనామా చేసినట్లుగా చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు... మీడియాకు నలుగురు వార్డు సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-08-21T13:40:06+05:30 IST