శ్రీవీరాంజనేయస్వామికి కలెక్టర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-01-30T00:37:09+05:30 IST

పట్టణంలో ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీవీరాంజనేయస్వామిని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

శ్రీవీరాంజనేయస్వామికి కలెక్టర్‌ దంపతుల ప్రత్యేక పూజలు
శ్రీవీరాంజనేయస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి మొక్క బహూకరిస్తున్న ఎమ్మెల్యే కిలారి

పొన్నూరుటౌన్‌, జనవరి 29 : పట్టణంలో ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీవీరాంజనేయస్వామిని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీవీరాంజనేయస్వామికి నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సహస్ర లింగేశ్వరస్వామి, స్వర్ణ వెంకటేశ్వరస్వామి, గరుత్మంతస్వామి, దశావతారాలస్వామి, కాలభైరవస్వామి ఉపాలయాలను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివార్ల శేష వస్త్రాలను అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య కలెక్టర్‌ దంపతులను దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి మెమోంటో, మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ నాగసూరి ప్రతాప్‌, ఈవో టి.శ్రీనివాస్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-30T00:37:10+05:30 IST