Janasena : జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి.. హరీష్ శంకర్ కీలక ప్రకటన..

ABN , First Publish Date - 2023-06-13T08:13:49+05:30 IST

జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న యాగంలో పాల్గొన్న దేవీ దేవతలను దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. వారాహి వాహానాన్ని హరీష్ శంకర్ పరిశీలించారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ షూటింగులు చేయాలనే అంశంపై పవన్ - దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. ఇకపై ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న క్రమంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు.

Janasena : జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి.. హరీష్ శంకర్ కీలక ప్రకటన..

అమరావతి : జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న యాగంలో పాల్గొన్న దేవీ దేవతలను దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. వారాహి వాహానాన్ని హరీష్ శంకర్ పరిశీలించారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ షూటింగులు చేయాలనే అంశంపై పవన్ - దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. ఇకపై ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న క్రమంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని నిర్ణయించారు.

కొన్ని లొకేషన్లను దర్శక నిర్మాతలు చూసి వచ్చారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. వారాహి యాత్ర చేపడుతున్న పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి తొలిసారి వచ్చానని.. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ ఇకపై మంగళగిరిలో ఉండబోతున్నారన్నారు. పవన్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. ఏపీ, బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లో షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామన్నారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయని హరీష్ శంకర్ తెలిపారు.

Updated Date - 2023-06-13T08:13:49+05:30 IST