అరాచక పాలనకు అంతం తప్పదు
ABN , First Publish Date - 2023-11-29T00:30:17+05:30 IST
ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
![అరాచక పాలనకు అంతం తప్పదు](https://media.andhrajyothy.com/media/2023/20231102/28_rgm_1_7e96ed8838.jpg)
రెడ్డిగూడెం, నవంబరు 28: ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాటిగూడెంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీలో పాల్గొని ప్రజలకు సూపర్సిక్స్ పథకాలకు సంబంధిం చిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బూత్ లెవల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మప్పిడి నాగేశ్వరరెడ్డి, కుప్పిరెడ్డి అశోక్రెడ్డి, కొలుసు స్వాములు, తాడి ఉమా, ఉప్పుశెట్టి ప్రసాద్, చీపు వెంకటేశ్వరరావుపాల్గొన్నారు.
జగ్గయ్యపేట: మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పట్టణంలో 13వ వార్డులో రజకబజార్, పద్మశాలీ బజార్, రంగస్వామి బజార్లలో పర్యటించారు. లోకేష్ యువగళం పాదయాత్రలకు జనం అనూహ్యంగా స్పందన లభిస్తుందన్నారు. సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందాలన్న చంద్ర బాబును గెలిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్ ్స వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మేకా వెంకటేశ్వర్లు, పున్నా లక్ష్మీ ఉపేంద్ర, గెల్లా వైకుంఠం, కర్నాటి రమేష్, పొట్టబత్తిన గంగాధర్, గోసిక శ్రీను, గాలం శ్రీను, బత్తుల శ్రీను పాల్గొన్నారు.