Share News

మల్లాయిపాలెంలో మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN , First Publish Date - 2023-11-29T00:43:13+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంలో కృషి చేయాలని ఎంపీపీ గద్దె పుష్పరాణి అన్నారు.

 మల్లాయిపాలెంలో మౌలిక వసతుల కల్పనకు కృషి

గుడివాడ రూరల్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంలో కృషి చేయాలని ఎంపీపీ గద్దె పుష్పరాణి అన్నారు. మల్లాయిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం జరిగింది. మల్లాయిపాలెం గ్రామాభివృద్ధికి రూ.కోటి 50 లక్షలు ఖర్చు చేశామన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడు గోళ్ల రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ భట్టు నాగమల్లేశ్వరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నేతల సుబ్బారావు, ఎం.సత్యనారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ కారే జోసెఫ్‌, పొడిచేటి కృష్ణ, ఎంపీడీవో ఏ.వెంకటరమణ, ఈవోపీఆర్డీ డి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి వి.హరికృష్ణ, మల్లాయిపాలెం గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:43:15+05:30 IST