ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: జేసీ
ABN , First Publish Date - 2023-11-28T23:37:53+05:30 IST
ఎన్నికల విధుల్లో బీఎల్ఓలు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరించారు.
![ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: జేసీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కల్లూరు, నవంబరు 28: ఎన్నికల విధుల్లో బీఎల్ఓలు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరించారు. మంగళవారం కల్లూరు, ముజఫర్నగర్, పంది పాడులోని దాదాపు 20 పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల ముసాయిదాలో అభ్యంతరాలపై అర్జీలు ఇస్తే విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణ పరిధిలో ఓటర్ల నమో దు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు, బీఎల్ఓలను ఆమె ఆదేశించారు. తుది ఓటర్ల జాబి తాలో ఎలాంటి పొరపాట్లు లేకుం డా ఓటర్ల నమోదు చేపట్టాలన్నారు. అనంతరం పోలింగ్ బూత్లలో తాగునీరు. కరెంట్, ర్యాంపు వంటి వసతులను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దారు టీవీ రమేష్బాబు, బీఎల్ఓలు తదితరులు ఉన్నారు.