Share News

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2023-11-28T23:39:12+05:30 IST

రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించండి

కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 28: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆయన జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం దగ్గర స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి నాగార్జున రెడ్డి మాట్లా డారు. ఈ సమావేశానికి పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ట్రాఫిక్‌ డీఎస్పీ నాగభూ షణం, జాతీయ రహదారి డీఈ సుధాకర్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకట రమణ, అదనపు డీఎంహెచ్‌వో డా.భాస్కర్‌, డీపీఎం మహేష్‌, కర్నూలు మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:39:15+05:30 IST