రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించండి
ABN , First Publish Date - 2023-11-28T23:39:12+05:30 IST
రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), నవంబరు 28: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్పోర్టు కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతినిధి నాగార్జున రెడ్డి మాట్లా డారు. ఈ సమావేశానికి పీఆర్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ట్రాఫిక్ డీఎస్పీ నాగభూ షణం, జాతీయ రహదారి డీఈ సుధాకర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకట రమణ, అదనపు డీఎంహెచ్వో డా.భాస్కర్, డీపీఎం మహేష్, కర్నూలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.