Share News

ఆడుదాం ఆంధ్రా...

ABN , First Publish Date - 2023-11-28T00:16:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలకు మంగళవారం నుంచి జిల్లాలో రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ పేర్కొన్నారు.

ఆడుదాం ఆంధ్రా...

క్రీడల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: కలెక్టర్‌

నంద్యాల టౌన్‌, నవంబరు 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలకు మంగళవారం నుంచి జిల్లాలో రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ పేర్కొన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో ఆడుదాం ఆంధ్ర లోగో, మస్కట్‌, బ్రోచర్లను ఆవిష్కరించి, ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ లింక్‌ను జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో వలంటీర్లు రిజిస్ర్టేషన్లు చేస్తారని తెలిపారు. గ్రామీణ, వార్డు, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలలో డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ వరకు క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, తదితర ఐదు అంశాలలో పోటీలు జరుగుతాయని అన్నారు.

Updated Date - 2023-11-28T00:16:39+05:30 IST