Share News

Kurnool: సీఎం జగన్ పర్యటన కోసం దుర్గా మండపం తొలగింపు

ABN , First Publish Date - 2023-10-15T09:52:43+05:30 IST

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో అధికారుల నిర్వాకం బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం అక్కడ ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని తొలగించారు.

Kurnool: సీఎం జగన్ పర్యటన కోసం దుర్గా మండపం తొలగింపు

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో అధికారుల నిర్వాకం బయటపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పర్యటన కోసం అక్కడ ఏర్పాటు చేసిన దుర్గమ్మ మండపాన్ని (Durgamma Mandapam) తొలగించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వివర్స్ కాలనీ మైదానంలో స్థానికులు దుర్గ మాత మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 19న జరిగే సీఎం జగన్ సభకు దుర్గా మండపం అడ్డు వస్తుందని అధికారులు పేర్కొంటూ మండపాన్ని తొలగించి సామాగ్రిని ఆటోలో తరలించారు. దీంతో స్థానికులు, దుర్గామాత భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-15T09:52:43+05:30 IST