Kodalinani: రంగా లక్ష్యాలను సాధించడంలో పునరంకితమవుతాం

ABN , First Publish Date - 2023-07-04T13:14:30+05:30 IST

గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Kodalinani: రంగా లక్ష్యాలను సాధించడంలో పునరంకితమవుతాం

విజయవాడ: గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. రంగా ఆశీస్సులతో ఆయన వదిలి వెళ్ళిన లక్ష్యాలను సాధించడంలో పునరంకితమవుతామన్నారు. కులం కోసం కాకుండా పేద ప్రజల కోసం కష్టపడిన మహోన్నత వ్యక్తి రంగా అని కొనియాడారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రంగా అని అన్నారు. రాజకీయ ఒత్తిడిలతో వంగవీటి మోహనరంగా హత్యకు గురయ్యారని తెలిపారు. భౌతికంగా దూరమై 35 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. నేటి రాజకీయాల్లో రంగా పేరు మీద ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఉందన్నారు. రాధా బాబుకు రాజకీయాల్లో ఉజ్వలమైన భవిష్యత్తును దేవుడు కల్పించాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు.

Updated Date - 2023-07-04T13:14:30+05:30 IST