Nellore: కావలిలో ‘బాబుతో నేను’ పోస్టర్లు..

ABN , First Publish Date - 2023-10-03T16:49:39+05:30 IST

నెల్లూరు జిల్లా: కావలిలో టీడీపీ నేత కావ్య కృష్ణా రెడ్డి ‘బాబుతో నేను’ అనే పోస్టర్లను భారీగా వేయించారు. దీంతో వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Nellore: కావలిలో ‘బాబుతో నేను’ పోస్టర్లు..

నెల్లూరు జిల్లా: కావలిలో టీడీపీ నేత (TDP Leader) కావ్య కృష్ణా రెడ్డి (Kavya Krishna Reddy) ‘బాబుతో నేను’ అనే పోస్టర్లను భారీగా వేయించారు. దీంతో వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి (MLA Ramireddy Pratap Reddy) అధికారులను ఆదేశించారు. ఓ వైపు సిబ్బంది పోస్టర్లను తొలగిస్తున్నారు. మరోవైపు కృష్ణారెడ్డి అనుచరులు పోస్టర్లను అతికిస్తున్నారు. దీంతో కృష్ణారెడ్డి అనుచరులను సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కావలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కావ్య కృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకు వైసీపీ (YCP)లో కీలంగా వ్యవహరించారు. కానీ అక్కడ పార్టీ విధానాలు, జగన్ (Jagan) పాలన నచ్చక వైసీపీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఆయన ‘బాబుతో నేను’ అనే పోస్టర్లు పెద్ద ఎత్తున కావలి పట్టణంలో గోడలకు అతికించారు. వాటిని చూసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పోస్టర్లను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కావలిలో ఒక్కొక్కరికి ఒక న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి చెందిన పోస్టర్లు, కటౌట్లను తొలగించరని, ప్రతిపక్షానికి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. కావలిలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు.

Updated Date - 2023-10-03T16:49:39+05:30 IST