AP News : పవన్ ఫ్యాన్స్ గ్రూప్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-07-28T10:47:48+05:30 IST

నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో ఫ్లెక్సీలు కట్టి సందడి చేస్తున్నారు.

AP News : పవన్ ఫ్యాన్స్ గ్రూప్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం.. తర్వాత ఏం జరిగిందంటే..

నెల్లూరు : నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో ఫ్లెక్సీలు కట్టి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పవన్ ఫ్యాన్స్ గ్రూప్ వార్ జరిగింది. మధ్యలోకి థియేటర్ యాజమాన్యం వెళ్లింది. మొత్తానికి రచ్చ రచ్చ.

గూడూరు పట్టణం సంగం సినిమా థియేటర్ లో బ్రో సినిమా ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్యాన్స్ కు యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించివేసింది. దీంతో ఏకమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేయడంతో తిరిగి థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-07-28T10:47:48+05:30 IST