Share News

ముస్లిం మైనార్టీలను దగా చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-11-29T01:26:24+05:30 IST

ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్‌ మాబు ఆరోపించారు.

ముస్లిం మైనార్టీలను దగా చేసిన ప్రభుత్వం

పెద్దదోర్నాల, నవంబరు 28: ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్‌ మాబు ఆరోపించారు. స్థానిక శివసదన్‌లో ఒంగోలు పార్లమెంటు మైనార్టీసెల్‌ ఉపాధ్యక్షులు షేక్‌ సమ్మద్‌ భాష అధ్యక్షతన మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షేక్‌ మాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం యాభై శాతం రాయితీతో రూ.2లక్షలు రుణాలు, పేద ముస్లింల విద్యార్ధుల కోసం విదేశీ విద్య ద్వారా 10లక్షల ఆర్థిక సాయం ఇమామ్‌, మౌజన్‌లకు రూ.5వేలు, రూ.3వేలు గౌరవ వేతనం మంజూరు, దుల్హన్‌ ద్వారా ఎటువంటి షరతులు లేకుండా పేద యువతుల వివాహం కోసం రూ.50,000లు అంద జేత, 300లకు పైగా షాదీఖానాల నిర్మాణాలు, రంజాన్‌ తోఫా ద్వారా పండుగ కానుకలు, వంటి కార్యక్రమాల ద్వారా అండగా నిలిచిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని పథకాలను రద్దు చేసి, దాడులకు తెగబడిందన్నారు. వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యలపై టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌, జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన ఒంగోలులో నిర్వహించే ముస్లిం మైనార్టీ పధకాలపై అవగాహన సదస్సుకు అందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గోడపత్రికలు అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు షరీఫ్‌, షేక్‌ మౌలాలి, భాష, రఫీ, ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:26:26+05:30 IST