Home » Andhra Pradesh » Prakasam
తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక పెద్దల ఆర్థిక సహకారంతో ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలు నిర్మించింది.
నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. వారు విదిల్చే కాసుల కు ప్రభుత్వ అధికారులు కక్కుర్తి పడుతున్నారు.
తనకు పోలీసులే అన్యా యం చేశారని, న్యాయం చే యాలని ఎస్పీ గరుడ్ సు మిత్ వద్ద బాధితుడు వా పోయాడు.
మండలంలోని పలుగ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వీచిన గాలులకు, కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.
కోడి మాంసం ధర కొండెక్కింది. కిలో రూ. 310కి చేరింది. గత ఆదివారం స్కిన్ లెస్ కిలో రూ.270 వరకూ ఉండగా ఇప్పు డు రూ.40 పెరిగింది.
ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్కు ఆదివారం సాయంత్రం కొందరు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అంతలోనే పోలీసులు అక్కడికి వచ్చారు. వాటర్ కెనాన్ను ఉపయోగించారు. అల్లరి మూకలు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ను ప్రయోగించారు.
అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా దఢేల్మని పెద్దశబ్దం.. కళ్లు తెరిచి చూసేలోపు కేకలు, అరుపులు.. కాపాడామని ఆర్తనాదాలు.. బస్సు నిండా క్షతగాత్రులు.. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని గంగవరం రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు టైరు పక్చర్ అయి అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్న సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితి ఇదీ. ఈ ప్రమాదంలో వెలిగండ్ల మండలానికి చెందిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అధికార పీఐసీగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను నియమించింది. ఈమేరకు రాష్ట్ర సహకార శాఖ కార్యదర్శి ఎ.బాబు ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఎంఎ్సలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది.
ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇటు టీడీపీ కూటమి, అటు వైసీపీ రాష్ట్రస్థాయి నేతల స్పందనలు కూడా అందుకు దోహదపడ్డాయి. రెండు రోజుల నుంచి జిల్లాలో పందేల జోరు పెరిగింది. ఇప్పటికే వందల కోట్ల బెట్టింగ్ జరిగింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేజిక్కించుకుంటుందన్న వైపు అధికంగా పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు లభించే స్థానాలపైనా బెట్టింగ్లు పెరిగాయి. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న విషయంపైనా పందేలు కాస్తున్నారు. కిందిస్థాయిలో దర్శి, కందుకూరు, ఒంగోలు, చీరాల లాంటి స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపోటములకన్నా ఆధిక్యతలపైనే పందేలు కడుతున్నారు. కొన్నిచోట్ల డబ్బుతోపాటు వారిచేతిలో ఉన్న పదవులపై కూడా పందేలు నడుస్తుండటం విశేషం. ఒంగోలు లోక్సభ స్థానంలో గెలుపోటములపై కూడా బెట్టింగ్లు పెరిగాయి.
చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, నేరాలకు పాల్పడితే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఆదివారం ఈపూరుపాలెం, టూటౌన్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ జిందాల్ పరిశీలించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లుపై చర్చించారు.