మహిళ అదృశ్యంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-11-28T23:53:47+05:30 IST
మహిళ అదృశ్యం కావడంపై భర్త ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బలివాడ గణేష్ కథనం మేరకు.. గార మండలంలోని లింగాలవలస గ్రామానికి చెందిన రుప్ప రాజారావు అయన అక్క అల్లు లక్ష్మి కుమార్తె పావనితో ఈఏడాది మే నెలలో వివాహం జరిగింది. ఆమె శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
![మహిళ అదృశ్యంపై కేసు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శ్రీకాకుళంక్రైం: మహిళ అదృశ్యం కావడంపై భర్త ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బలివాడ గణేష్ కథనం మేరకు.. గార మండలంలోని లింగాలవలస గ్రామానికి చెందిన రుప్ప రాజారావు అయన అక్క అల్లు లక్ష్మి కుమార్తె పావనితో ఈఏడాది మే నెలలో వివాహం జరిగింది. ఆమె శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదేక్రమంలో ఈనెల 27న ఉదయం తొమ్మిది గంటలకు కళాశాలకు దించేందుకు తన భార్యను తీసుకువెళ్లాడు. నర్సింగ్ కళాశాలకు వెళ్తానని చెప్పడంతో రాజారావు ఉమెన్స్కళాశాల రోడ్డులోని ఆంరఽధాబ్యాంకు వద్ద ఆమె దింపి తిరిగి వెళ్లి పోయాడు. సాయంత్రం ఆమె తీసుకురావడానికి వెళ్లగా కళాశాలకు రాలేదని పావని స్నేహితులు రాజారావుకు తెలిపారు. దీంతో ఆమెకోసం వెదికినా ఆచూకీ లభించకపో వడంతో మంగళవారం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ తన భార్య కనిపించడంలేదని రాజారావు ఫిర్యాదుచేశాడు.