Home » Andhra Pradesh » Srikakulam
సార్వత్రిక ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థుల్లో టెన్షన్ సాధారణమే. కానీ గత ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థుల్లో మాత్రం మరింత టెన్షన్ కనిపిస్తోంది. ఇందులో ప్రస్తుత శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు ముందువరుసలో ఉన్నారు.
జిల్లాలో చాలామంది గృహ నిర్మాణదారులు ఓటీఎస్ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. వేలాది మంది లబ్ధిదారుల నుంచి ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్ స్కీం) కింద డబ్బులు కట్టించుకున్నారు.
వేసవి వేళ.. జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ పాలనలో ఉద్దానం ప్రాజెక్టు అటకెక్కింది. ఎక్కడికక్కడ పైపులైన్లు లీకేజీ కాగా.. నీరు వృథాగా పోతోంది.
స్థలాల కొనుగోలు పేరిట దుండగులు.. ఓ కాంట్రాక్టర్ను బురిడీ కొట్టించారు. రూ.10లక్షల మేర నగదు కాజేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన కాంట్రాక్టర్ ఎన్.మణికంఠకు.. శ్రీకాకుళం నగరానికి చెందిన శ్రీధర్తో పరిచయం ఉంది.
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లిలోని ఆదిత్యుడి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైశాఖమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు ఆదిత్యుడి దర్శనానికి పోటెత్తారు.
నరసన్నపేట వేంకటేశ్వరుని దేవస్థానంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అమ్మవార్ల సంబరాలతో పాటు వెంకన్న స్వామి, నరసింహ స్వాముల కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్ర మాలు నిర్వహించారు.
జీడి రైతులకు పెట్టుబడులు పెరిగి దిగుబడులు లేక నష్టాలకు గురవుతు న్నారని, ప్రభుత్వం పంటల బీమా అమలు చేసి ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు మామిడి మాధవరావు అన్నారు. హరిపురం మార్పు ట్రస్ట్ భవనంలో ఆదివారం జీడి రైతులతో సమావేశం నిర్వహించారు.
కమ్యూనిస్టు ఉద్యమనేత, స్వాతంత్య్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం టెక్కలి, వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ, కొత్తూరు, మందసల్లో సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు.
కమ్యూనిస్టుఉద్యమ నిర్మాత, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు అనుసరణీయమని ప్రజా ఉద్యమనేత బొడ్డేపల్లి మోహన్రావు తెలిపారు. ఆదివారం ఆమదాలవలస పూజారి పేటలో సుందరయ్య వర్థంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పూర్వపు జిల్లా కార్యదర్శి బొడ్డేపల్లి కనకలక్ష్మి, భవననిర్మాణ కార్మికులు టి.రాజారావు, తిరుపతిరావు, కె.రమ, కె.కమల పాల్గొన్నారు.