పొందూరులో పిచ్చికుక్క స్వైరవిహారం
ABN , First Publish Date - 2023-11-29T00:03:53+05:30 IST
పొందూరులో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో కనిపించినవారిపై దాడిచేసి కరవడంతో 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.
![పొందూరులో పిచ్చికుక్క స్వైరవిహారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- 20 మందికిపైగా తీవ్ర గాయాలు
పొందూరు, నవంబరు 28: పొందూరులో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో కనిపించినవారిపై దాడిచేసి కరవడంతో 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. ముందుగా పొందూరు అంబేడ్కర్ కూడలి వద్ద ఇద్దరిపై పిచ్చికుక్క దాడి చేసింది. తర్వాత కేవీఆర్ థియేటర్ సమీపంలో పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎంపీడీవో కార్యాలయంలో సమీపంలో కొంచాడ వీఆర్ఏతో పాటు మరికొందరిపైనా దాడి చేసింది. అక్కడినుంచి బస్టాండ్వైపు వెళ్లి.. మరికొంతమందిని గాయపరిచింది. కొంతమంది బాధితులకు తీవ్రగాయాలు కావడంతో విలవిల్లాడారు. 12మంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన బాధితులు ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారు. స్థానిక యువకులు కర్రలతో పిచ్చికుక్కను హతమార్చారు.