TTDP.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు: కాసాని వీరేష్

ABN , First Publish Date - 2023-09-11T14:26:57+05:30 IST

హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపిచ్చింది.

TTDP.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు: కాసాని వీరేష్

హైదరాబాద్: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Ex CM Chandrababu Naidu)పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంపై టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు (Activists), అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపిచ్చింది. బంద్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌ (Hyderabad)లో టీటీడీపీ (TTDP) ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ (Kasani Veeresh) ఎన్టీఆర్ భవన్‌ (NTR Bhavan)లో మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి లండన్‌లో జగన్ (Jagan) పైశాచిక అనందం పోతున్నారని మండిపడ్డారు. ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారన్నారు.

జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి చంద్రబాబును జైలుకు పంపారని, ప్రజల ఓట్లతో మరోసారి జగన్‌ను జైలుకు పంపిస్తారని కాసాని వీరేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. చంద్రబాబును విడుదల చేసేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సైకో జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రపంచంలో తెలుగు వారందరు చంద్రబాబు అరెస్టును ఖండించాలని పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలని కాసాని వీరేష్ ఆకాంక్షించారు.

Updated Date - 2023-09-11T14:26:57+05:30 IST