Home » Pressmeet
అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మదనపల్లిలో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
తిరుపతి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసారని.. అది ధర్నాలా లేదని.. డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుందని, బీఆర్ఎస్ హయం లో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీదని .. అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఒకసారి చరిత్ర తిరగేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షానికి ఎలా సహకరించాలో తెలుసుకోవాలని సూచించారు.
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్పై తనను కలిసిన మీడియాతో సీఎం కొద్దిసేపు చిట్ చాట్గా మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందన్నారు.
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో సభా విధానాలు, కార్యక్రమాలను నిర్వీర్యం చేసి నవ్వులు పూయించారని, ప్రజా ప్రయోజనాల కోసం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారని, పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.