AP News: ఏపీ రోడ్లపై ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-09T15:01:43+05:30 IST

అల్లూరి: ఏపీ (AP) రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapurao) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.

AP News: ఏపీ రోడ్లపై ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు

అల్లూరి: ఏపీ (AP) రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapurao) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఆదివారం పాడేరులో జన జాతి సురక్ష మంచ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పాడేరులో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. 80 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు. పాడేరువాసులు విశాఖ ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా... జిల్లా హెడ్ క్వార్టర్లు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు.

తెలంగాణ వెనుకబడిందని అనుకున్నానని, కానీ ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సోయం బాపూరావు అన్నారు. పాడేరులో ఇప్పటికీ చదువుకోని యువత ఉన్నారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాడేరు, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని సోయం బాపూరావు అన్నారు.

Updated Date - 2023-04-09T15:01:43+05:30 IST