Home » Andhra Pradesh » Visakhapatnam
జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎండలు మండిపోయాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోయారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, ఆ తరువాత నుంచి వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. మురుగుకాల్వలు సైతం వర్షపు నీటితో ప్రవహించాయి. అలాగే జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. తాజా వాతావరణంతో జనం ఊరట చెందుతున్నారు. ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది.
ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ ఉత్సవాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చే నెలకు వాయిదా పడినప్పటికీ ఆదివారం మాత్రం పాడేరులో పండగ సందడి నెలకొంది. వాస్తవానికి ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండడంతో వారం, పది రోజుల కిత్రమే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానికుల బంధువులు ఇక్కడికి వచ్చారు. అలాగే వారి మొక్కులను సైతం తీర్చుకున్నారు.
విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్సప్లై కార్పొరేషన్(విస్కో)లో తాత్కాలిక ఉద్యోగి ఒకరు చక్రం తిప్పుతున్నారు.
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి పెనుముప్పు తప్పింది. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీని వల్ల వినియోగంలో ఉన్న నాలుగు జనరేటర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తుండగా నాల్గవ నంబరు జనరేటర్ ఎమ్ఐబీకి చెందిన వాల్వ్ నుంచి భారీగా నీరు ప్రవేశించింది.
మండలంలోని గోవాడలో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపాధి కూలీలను వైసీపీ నాయకులు రెచ్చగొట్టడంతో వారంతా టీడీపీ నాయకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ముక్కుపిండి మరీ వసూలు చేసిన జీవీఎంసీ అధికారులు... రెండు నెలలుగా ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులపై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో ఐదేళ్లుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు కూడా నీరు అందే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎలమంచిలి పట్టణ ప్రజలకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులో లేకుండాపోయాయి. కేవలం పల్లె వెలుగు, మెట్రో బస్సు సర్వీసులకే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిమితమైంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అనకాపల్లికి టికెట్ తీసుకుని ఎలమంచిలి బైపాస్ రోడ్డులో దిగాల్సిన దుస్థితి నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో జిల్లాలో ఒక్కోలా పారితోషికం అందింది.