తొలగింపు ఓట్లపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2023-11-29T00:12:04+05:30 IST
తప్పుడు మార్గంలో ఓట్లను తొలగించకుండా చర్యలు చేపట్టాలని శృంగవర పుకోట నియో జకవర్గ ఎన్నికల అధికారి సుద ర్శన దొరను మండల టీడీపీ అధ్యక్షుడు జీ.ఎస్.నాయుడు కోరారు.
![తొలగింపు ఓట్లపై దృష్టి పెట్టండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శృంగవరపుకోట, నవంబరు 28: తప్పుడు మార్గంలో ఓట్లను తొలగించకుండా చర్యలు చేపట్టాలని శృంగవర పుకోట నియో జకవర్గ ఎన్నికల అధికారి సుద ర్శన దొరను మండల టీడీపీ అధ్యక్షుడు జీ.ఎస్.నాయుడు కోరారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు వినతి పత్రం అందించారు. డబుల్ ఎంట్రీ, సున్నా ఇంటినెంబర్, ఒకే ఇంటి నెంబర్తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని, అర్హత లేని ఓట్లను గుర్తించాలని పేర్కొన్నారు.